రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి
- May 24, 2019
బహ్రెయిన్:దార్ కులైబ్ విలేజ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాలుగేళ్ళ చిన్నారిని బలి తీసుకుంది. హమాద్ టౌన్ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారిని రీమ్ హుస్సైన్ అల్ అరాదిగా గుర్తించారు. ఓ ఫ్లవర్ షాప్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొంది. విలేజ్ ప్రారంభంలో తన తండ్రికి చెందిన ఓ ఫ్లవర్ షాప్ వద్దకు చిన్నారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 'ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నిన్ను నేను కోల్పోయాను. వింటున్నావా, నీ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు' అని ఆ చిన్నారి తండ్రి తన కూతురి కోసం రాసిన అక్షరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చాలామందికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







