రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి
- May 24, 2019
బహ్రెయిన్:దార్ కులైబ్ విలేజ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాలుగేళ్ళ చిన్నారిని బలి తీసుకుంది. హమాద్ టౌన్ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారిని రీమ్ హుస్సైన్ అల్ అరాదిగా గుర్తించారు. ఓ ఫ్లవర్ షాప్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొంది. విలేజ్ ప్రారంభంలో తన తండ్రికి చెందిన ఓ ఫ్లవర్ షాప్ వద్దకు చిన్నారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 'ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నిన్ను నేను కోల్పోయాను. వింటున్నావా, నీ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు' అని ఆ చిన్నారి తండ్రి తన కూతురి కోసం రాసిన అక్షరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చాలామందికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







