ఏజెంట్ చేతిలో మోసపోయిన 35 మంది భారతీయ వలసదారులు
- May 27, 2019
భారతదేశంలోని కర్నాటకకు చెందిన 35 మంది భారతీయ కార్మికులు ఎంప్లాయ్మెంట్ ఫ్రాండ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా కువైట్కి తాము వెళ్ళినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి దగ్గరనుంచి సదరు సంస్థ 65,000 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు బాధితులు. కువైట్ చేరుకున్న తర్వాతగానీ బాధితులకు తాము మోసపోయిన విషయం తెలియలేదు. ఆరు నెలలుగా కువైట్లో సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, తకు జీతాలు సరిగ్గా రాలేదని బాధితులు పేర్కొంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కంపెనీ తమను మోసం చేసిందనీ, కువైట్ జైళ్ళలో మగ్గేలా చేస్తామని బెదిరిస్తోందనీ వాపోయారు. విధి నిర్వహణలో నలుగురు కార్మికులు గాయపడినా, వారిని కంపెనీ ఆదుకోలేదని ఓ బాధితుడు చెప్పారు. బాధితుల వెతలకు సంబంధించిన వీడియో చూసిన మంగళూరు సౌత్ ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్, వారికి సాయం చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. బాధితులంతా మంగళూరుకి చెందినవారే.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







