దుబాయ్-శంషాబాద్ వచ్చిన మహిళ నుంచి భారీగా బంగారం పట్టివేత
- May 28, 2019హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేశారు. ఆమె బ్యాగు నుంచి సుమారు 11.1కిలోల బంగారంతో పాటు 1.5 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏడు క్లాత్ ప్యాకెట్లలో బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్టు గుర్తించామని వివరించారు. ఆ మహిళను అరెస్టుచేసి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. దుబాయ్ లో ఈ మహిళకు బంగారాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఎవరికి ఇవ్వమని చెప్పారు? గతంలో ఏమైనా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందా? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నట్టు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు