దుబాయ్-శంషాబాద్ వచ్చిన మహిళ నుంచి భారీగా బంగారం పట్టివేత
- May 28, 2019
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేశారు. ఆమె బ్యాగు నుంచి సుమారు 11.1కిలోల బంగారంతో పాటు 1.5 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏడు క్లాత్ ప్యాకెట్లలో బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్టు గుర్తించామని వివరించారు. ఆ మహిళను అరెస్టుచేసి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. దుబాయ్ లో ఈ మహిళకు బంగారాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఎవరికి ఇవ్వమని చెప్పారు? గతంలో ఏమైనా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందా? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నట్టు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







