ఇందిరాగాంధీ పాత్రలో అలనాటి అందాల తార
- May 29, 2019ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రవీనాటాండన్ ఇప్పుడు ముఖ్యపాత్రలలో మెరుస్తోంది. 90వ దశకంలో అక్కినేని నటించిన రధసారథిలోనూ, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రంలోనూ రవీనాటాండన్ కథనాయికగా నటించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలే చేస్తూ వచ్చిన ఆమె ఇన్నేళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఆ మధ్య కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రం తెరకెక్కుతోంది. చాప్టర్-1కు వివిధ భాషల్లో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్ను నిర్మించే పనిలో చిత్రబృందం ఉంది. కాగా పీరియాడిక్ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన సన్నివేశాలున్నాయట. దాంతో ఆ పాత్రకు రవీనా అయితే న్యాయం చేకూరుస్తుందని, అంతేకాకుండా ఆమె నటించడం వల్ల బాలీవుడ్లో చిత్రాన్ని మార్కెట్ చేయడం కూడా సులువు అవుతుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు