ట్రంప్ మరో సంచలనం.. భారత్ కు జీఎస్పి..
- June 01, 2019
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్యపరంగా భారత్ కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా GSP తొలగించేందుకు సిద్దమయ్యారు. జీఎస్పీ రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్ … జూన్ 5నుంచి జీఎస్పీ హోదా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌజ్ లో జరిగిన ఓ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3వ తేదీతో ముగుస్తుంది.
ఓ వైపు భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామంటూనే ట్రంప్ జిఎస్పీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో సమానమైన, సమర్ధనీయమైన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామి లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ గతంలో కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే జీఎస్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







