శ్రీహరి తనయుడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
- June 02, 2019
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి 2013లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉన్న సమయంలో ఆయన హఠాత్తుగా మరణించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు శ్రీహరి పెద్ద తనయుడు మేఘాంశ్ హీరోగా వెండితెరకి పరిచయం కాబోతున్నాడు. రాజ్దూత్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రంలో మేఘాంశ్ నటిస్తుండగా, రీసెంట్గా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన లెదర్ జాకెట్, జీన్ ప్యాంటు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు మేఘాంశ్. ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్గా భైరవ అనే సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. ఇందులో శ్రీహరి హీరోగా నటించారు. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న మేఘాంశ్ ఇప్పుడు రాజ్దూత్ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ళ పాటు నటనలో శిక్షణ తీసుకున్న ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా అయ్యాడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ నిర్మిస్తున్నారు . రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







