ఇరాన్ను సమర్ధిస్తే చమురు సరఫరాలు కట్..!
- June 02, 2019
మక్కా:గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులతో ప్రపంచదేశాలకు చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం వుందని సౌదీ రాజు సల్మాన్ హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న ఒఐసి దేశాల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ ఇరాన్ను సమర్ధిస్తే చమురు సరఫరాలు నిలిచిపోయే అవకాశం వుందని ఆయన మిత్రదేశాలకు సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో ఎమిరేట్స్ సముద్ర తీరంలో జరిగిన దాడుల్లో సౌదీకి చెందిన చమురు నౌకలు దెబ్బతినటంతో ఇరాన్-సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తమ ప్రమేయం ఏమీలేదని ఇరాన్ సౌదీకి గట్టిగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఓఐసి సదస్సు ముగింపు కార్యక్రమంలో రాజు సల్మాన్ మాట్లాడుతూ ఈ ఉగ్రవాద దాడులు కేవలం సౌదీకి మాత్రమే కాక గల్ఫ్ప్రాంత దేశాలకు, ప్రపంచ చమురు సరఫరాలకు వ్యతిరేకంగా జరిగినట్లు తాము భావిస్తున్నామన్నారు. తమకు ఎదురయ్యే ముప్పులను, విచ్ఛిన్న కార్యకలాపాలను తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







