ఇరాన్‌ను సమర్ధిస్తే చమురు సరఫరాలు కట్‌..!

- June 02, 2019 , by Maagulf
ఇరాన్‌ను సమర్ధిస్తే చమురు సరఫరాలు కట్‌..!

మక్కా:గల్ఫ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులతో ప్రపంచదేశాలకు చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం వుందని సౌదీ రాజు సల్మాన్‌ హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న ఒఐసి దేశాల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ ఇరాన్‌ను సమర్ధిస్తే చమురు సరఫరాలు నిలిచిపోయే అవకాశం వుందని ఆయన మిత్రదేశాలకు సూచించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో ఎమిరేట్స్‌ సముద్ర తీరంలో జరిగిన దాడుల్లో సౌదీకి చెందిన చమురు నౌకలు దెబ్బతినటంతో ఇరాన్‌-సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తమ ప్రమేయం ఏమీలేదని ఇరాన్‌ సౌదీకి గట్టిగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఓఐసి సదస్సు ముగింపు కార్యక్రమంలో రాజు సల్మాన్‌ మాట్లాడుతూ ఈ ఉగ్రవాద దాడులు కేవలం సౌదీకి మాత్రమే కాక గల్ఫ్‌ప్రాంత దేశాలకు, ప్రపంచ చమురు సరఫరాలకు వ్యతిరేకంగా జరిగినట్లు తాము భావిస్తున్నామన్నారు. తమకు ఎదురయ్యే ముప్పులను, విచ్ఛిన్న కార్యకలాపాలను తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com