మరొక థ్రిల్లింగ్ మూవీతో రాబోతున్న అడివి శేష్...
- June 03, 2019
అడివి శేష్ మొదట కర్మ అనే సినిమాకు తానే స్వయంగా కథను సమకూర్చి నటిస్తూ, దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఇక అక్కడినుండి అయన వరుసగా సినిమాల్లో నటించడం మొదలెట్టారు. అయితే ఆయనకు మాత్రం ఎక్కువగా నెగటివ్ పాత్రలే దక్కాయి. అయినప్పటికీ తన పాత్రలకు పూర్తి న్యాయం చేసిన శేష్ కు, తనలోని రైటర్ కు ఎప్పటికైనా మళ్ళి పని పెట్టి, ఎప్పటికైనా మంచి హిట్ అందుకోవాలని భావించారు.
అనుకున్న విధంగా తాను రాసుకున్న కథ నచ్చి, పివిపి నిర్మాతగా వ్యవహరిస్తూ తననే హీరోగా పెట్టి క్షణం సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వచ్చిన క్షణం, చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత ఆయన కథను సమకూర్చి నటించిన గూఢచారి కూడా సూపర్ హిట్ అయి శేష్ కు రైటర్ మరియు నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. అదే స్ఫూర్తి తో ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన బాఘీ-2 కి కథను అందించారు శేష్. ఇక ప్రస్తుతం అయన గూఢచారి సినిమా సీక్వెల్ లో నటిస్తున్నారు. కాగా నేడు మరొక్కసారి అయన పివిపి బ్యానర్ లో నటిస్తున్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలయింది.
ఎవరు పేరుతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా, పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ అని శేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఆగష్టు 23న ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో శేష్ కు జోడిగా రెజీనా నటిస్తుండగా, ఈ చిత్రానికి దర్శకుడిగా వెంకట్ రాంజీ వహిస్తున్నారు. మరొక్కసారి థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అడివి శేష్, ఈ సారి ఎంతటి విజయాన్ని అందుకుంటారో వేచిచూడాలి...!!
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







