లిబియాలో మరో పడవ ప్రమాదం

- June 03, 2019 , by Maagulf
లిబియాలో మరో పడవ ప్రమాదం

లిబియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. సముద్రంలో బోటులపై ప్రయాణిస్తున్న వసలదారులు పడవలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మరో ప్రమాదం ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

లిబియా దేశంలోని గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలను లిబియన్ కోస్ట్ గార్డులు వెలికితీశారు. కాగా లిబియా నుంచి వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com