రమదాన్‌ 27వ రోజు: షేక్‌ జాయెద్‌ మాస్క్‌లో 64,000 మంది ప్రార్థనలు

- June 03, 2019 , by Maagulf
రమదాన్‌ 27వ రోజు: షేక్‌ జాయెద్‌ మాస్క్‌లో 64,000 మంది ప్రార్థనలు

అబుదాబీలోని షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌లో తరవీ మరియు తహాజుద్‌ ప్రార్థనల్ని నిర్వహించేందుకోసం 27వ రమదాన్‌ రాత్రి 46,860 మంది ఒక్క చోట గుమికూడారు. ప్రేయర్‌ హాల్స్‌, ఐకానిక్‌ మాస్క్‌ యార్డ్స్‌లో మొత్తం 35,763 మందికి ప్రార్థనలు నిర్వహించే అవకావం ఉండగా, అంతకు మించి వర్షిపర్స్‌ ప్రార్థనలు నిర్వహించారు. తరావీ ప్రేయర్‌ని 11,043 మంది నిర్వహించారు. ఇఫ్తార్‌ మీల్స్‌ని 35,390 మందికి ఏర్పాటు చేశారు. ఫుజారియాలోని షేక్‌ జాయెద్‌ మాస్క్‌ 1,304 మంది వర్షిపర్స్‌తో తరావీహ్‌ ప్రార్థనల్ని విట్‌నెస్‌ చేసింది. తహాజుద్‌ ప్రార్థనల్ని 5,103 మంది నిర్వహించారు. షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌, పెద్దయెత్తున వలంటీర్స్‌తో వర్షిపర్స్‌కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఉచిత బస్‌ సర్వీసుల్ని కూడా ఏర్పాటు చేశారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com