షార్జాలో భవనం పైనుంచి పడి గాయపడ్డ వలస కార్మికుడు

- June 03, 2019 , by Maagulf
షార్జాలో భవనం పైనుంచి పడి గాయపడ్డ వలస కార్మికుడు

షార్జా:30 ఏళ్ళ భారతీయ వలస కార్మికుడు ఓ భవనంపైనుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అల్‌ కాసిమి హాస్పిటల్‌లోని ఐసీయూలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వలస కార్మికుడ్ని మహేంద్ర కుమార్‌గా గుర్తించారు. షార్జాలోని ఓ కాంట్రాక్టింగ్‌ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు మహేంద్ర కుమార్‌. భవనం మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో పడి వున్న కార్మికుడ్ని గుర్తించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com