షార్జాలో భవనం పైనుంచి పడి గాయపడ్డ వలస కార్మికుడు
- June 03, 2019
షార్జా:30 ఏళ్ళ భారతీయ వలస కార్మికుడు ఓ భవనంపైనుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అల్ కాసిమి హాస్పిటల్లోని ఐసీయూలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వలస కార్మికుడ్ని మహేంద్ర కుమార్గా గుర్తించారు. షార్జాలోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు మహేంద్ర కుమార్. భవనం మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో పడి వున్న కార్మికుడ్ని గుర్తించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







