రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్ల ధ్వంసం, ఒకరి మృతి
- June 04, 2019
32 ఏళ్ళ ఆసియా వలసదారుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ రీజియన్లోని నజావి అల్ మదామ్ స్ట్రీట్ రౌండెబౌట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన గురించిన సమాచారం అందగానే, ఘటనా స్థలికి ట్రాఫిక్ అధికారులు, అంబులెన్స్, పెట్రోల్స్ టీమ్ చేరుకున్నాయి. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ ధాయిద్ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో ఓ కారు, మరో మూడు కార్లపైకి దూసుకెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వేగంగా దూసుకొచ్చిన కారుని నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో కొందిరికి తీవ్రగాయాలు కాగా, కొందరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







