రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్ల ధ్వంసం, ఒకరి మృతి

- June 04, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్ల ధ్వంసం, ఒకరి మృతి

32 ఏళ్ళ ఆసియా వలసదారుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. సెంట్రల్‌ రీజియన్‌లోని నజావి అల్‌ మదామ్‌ స్ట్రీట్‌ రౌండెబౌట్‌ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన గురించిన సమాచారం అందగానే, ఘటనా స్థలికి ట్రాఫిక్‌ అధికారులు, అంబులెన్స్‌, పెట్రోల్స్‌ టీమ్‌ చేరుకున్నాయి. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు. గాయపడ్డవారిని హుటాహుటిన అల్‌ ధాయిద్‌ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో ఓ కారు, మరో మూడు కార్లపైకి దూసుకెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వేగంగా దూసుకొచ్చిన కారుని నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో కొందిరికి తీవ్రగాయాలు కాగా, కొందరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com