రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్ల ధ్వంసం, ఒకరి మృతి
- June 04, 2019
32 ఏళ్ళ ఆసియా వలసదారుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ రీజియన్లోని నజావి అల్ మదామ్ స్ట్రీట్ రౌండెబౌట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన గురించిన సమాచారం అందగానే, ఘటనా స్థలికి ట్రాఫిక్ అధికారులు, అంబులెన్స్, పెట్రోల్స్ టీమ్ చేరుకున్నాయి. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ ధాయిద్ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో ఓ కారు, మరో మూడు కార్లపైకి దూసుకెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వేగంగా దూసుకొచ్చిన కారుని నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో కొందిరికి తీవ్రగాయాలు కాగా, కొందరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!







