విశాఖపట్నంలో జగన్‌కు ఘనస్వాగతం

- June 04, 2019 , by Maagulf
విశాఖపట్నంలో జగన్‌కు ఘనస్వాగతం

విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌కు విమానాశ్రయంలో  ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సీఎం..తొలుత పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి పూజల్లో పాల్గొంటారని పీఠం ప్రతినిధులు తెలిపారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సందర్భంగా స్వామితో ఆంతరంగికంగా కాసేపు చర్చించే అవకాశం ఉంది. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులను జగన్‌ పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ వెళుతున్నారు. ఈ నెల 8న మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో మంత్రుల పేర్ల విషయమై స్వరూపానందేంద్రను కలిసినపుడు చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com