రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి

- June 04, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి

సార్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వలసదారుడి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్‌, ఆసియాకి చెందిన వలసదారుడ్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని భారతీయ వలసదారుడు రాజు గుండెబోయినగా గుర్తించారు. మేసన్‌గా రాజు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com