మహేష్ బ్యానర్లో విజయ్ సినిమా.!
- June 04, 2019మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మంచి డబ్బులు వచ్చాయి. తరువాత బ్రహ్మోత్సవం సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా ఫెయిల్ కావడంతో సొంత బ్యానర్లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మహేష్ మరలా తన సొంత బ్యానర్ జిఎంబి సినిమాస్ లో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, మహేష్ బాబు సొంత బ్యానర్లో బయట హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. జిఎంబి సినిమాస్ లో అడవి శేష్ తో మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. మహెష్ బాబు నిర్మాత. ముంబై దాడుల్లో మరణించిన ఆఫీసర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు జిఎంబి సినిమాస్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు బ్యానర్లో సినిమా అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం నమ్రత ఆ బిజీలోనే ఉన్నారట. విజయ్ సినిమా కోసం కావాల్సిన కథను సిద్ధం చేయిస్తున్నారని వినికిడి.
మరో సమాచారం ప్రకారం, మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇది నిజమైతే మహెష్ 26 కు ఓ స్పెషల్ వచ్చినట్టే. గీత గోవిందం హీరో హీరోయిన్లు ఇద్దరు ఈ సినిమాలో నటించినట్టు అవుతుంది.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు