మహేష్ బ్యానర్లో విజయ్ సినిమా.!
- June 04, 2019
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మంచి డబ్బులు వచ్చాయి. తరువాత బ్రహ్మోత్సవం సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా ఫెయిల్ కావడంతో సొంత బ్యానర్లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మహేష్ మరలా తన సొంత బ్యానర్ జిఎంబి సినిమాస్ లో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, మహేష్ బాబు సొంత బ్యానర్లో బయట హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. జిఎంబి సినిమాస్ లో అడవి శేష్ తో మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. మహెష్ బాబు నిర్మాత. ముంబై దాడుల్లో మరణించిన ఆఫీసర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు జిఎంబి సినిమాస్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు బ్యానర్లో సినిమా అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం నమ్రత ఆ బిజీలోనే ఉన్నారట. విజయ్ సినిమా కోసం కావాల్సిన కథను సిద్ధం చేయిస్తున్నారని వినికిడి.
మరో సమాచారం ప్రకారం, మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇది నిజమైతే మహెష్ 26 కు ఓ స్పెషల్ వచ్చినట్టే. గీత గోవిందం హీరో హీరోయిన్లు ఇద్దరు ఈ సినిమాలో నటించినట్టు అవుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







