రమదాన్ సందర్భంగా 22,000కి పైగా మీల్స్ పంపిణీ
- June 05, 2019
రమదాన్ సీజన్లో పేద కుటుంబాలకు స్థానిక ఎన్జివో 'కన్సర్వింగ్ బౌంటీస్' 22,000లకి పైగా మీల్స్ని పంపిణీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం జరిగింది. హెల్త్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఆహారాన్ని సేకరించి, పంపిణీ చేశామని ఎన్జిఓ సంస్థ ప్రతినిథులు తెలిపారు. 2018లోనూ ఈ సంస్థ పెద్దయెత్తున మీల్స్ పంపిణీ చేపట్టింది. అప్పట్లో 14,000కి పైగా మీల్స్ అందించగా, ఈసారి 22,000కి పైగా మీల్స్ పంపిణీ చేపట్టగలిగినట్లు నిర్వాహకులు తెలిపారు. 'యువర్ ఎక్సెస్ ఈజ్ సంవన్ ఎల్స్స్ రిలీఫ్' అనే నినాదంతో ఛారిటీ వర్క్ చేపట్టామని కన్సర్వింగ్ బౌంటీస్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!