సమ్మర్‌ రష్‌: ఇండియాకి అదనంగా విమాన సర్వీసుని పెంచిన ఇండిగో

- June 06, 2019 , by Maagulf
సమ్మర్‌ రష్‌: ఇండియాకి అదనంగా విమాన సర్వీసుని పెంచిన ఇండిగో

దోహా:ఇండిగో కొత్త విమాన సర్వీసుని ఖతార్‌ నుంచి ఇండియాకి సమ్మర్‌ హాలీడేస్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసింది. ఆర్థిక సమస్యలతో జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఖతార్‌ నుంచి నడిపే విమానాల్ని షట్‌ డౌన్‌ చేసిన దరిమిలా, ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజువారీ ప్రాతిపదికన దోహా నుంచి ముంబైకి నాన్‌ స్టాప్‌ విమానాన్ని అదనంగా నడుపుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దోహా నుంచి ఉదయం 4.40 నిమిసాలకు ప్రాంభమయ్యే విమానం ముంబైకి 10.50 నిమిషాలకు చేరుతుంది. మరో విమానం రాత్రి 9 గంటలకు బయల్దేరి, ముంబైకి తెల్లవారు ఝామున 3.10 నిమిషాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి ఉదయం 11.55 నిమిషాలకు అలాగే సాయంత్రం 6.40 నిమిషాలకు బయల్దేరే విమానాలు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు అలాగే రాత్రి 8 గంటలకు దోహా చేరుకుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com