అతి వేగంపై దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- June 08, 2019
దుబాయ్లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం 17 మందిని బలి తీసుకున్న ఘటన నేపథ్యంలో దుబాయ్ పోలీస్, వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు అతి వేగానికి సంబంధించి. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, వాహనదారులు పరిమిత వేగంతో మాత్రమే తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని హెచ్చరించారు పోలీసులు. అతి వేగంతో వాహనాలు ప్రయాణిస్తే, వాహనదారులపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు. దుబాయ్లోని అల్ రష్దియాలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ బస్సు హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్ని ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. బ్యారియర్ 2.2 మీటర్ల ఎత్తులో వుండగా, అంతకంటే ఎక్కువ ఎత్తున్న బస్సులు ఈ మార్గంలో ప్రయాణించడానికి లేదు. అయితే, మవసలాట్కి చెందిన బస్సు అతి వేగంతో దూసుకొచ్చి ఈ బ్యారియన్ని ఢీకొంది. మస్కట్ - దుబాయ్ మధ్య తిరిగే బస్సు ఇది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







