అతి వేగంపై దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- June 08, 2019దుబాయ్లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం 17 మందిని బలి తీసుకున్న ఘటన నేపథ్యంలో దుబాయ్ పోలీస్, వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు అతి వేగానికి సంబంధించి. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, వాహనదారులు పరిమిత వేగంతో మాత్రమే తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని హెచ్చరించారు పోలీసులు. అతి వేగంతో వాహనాలు ప్రయాణిస్తే, వాహనదారులపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు. దుబాయ్లోని అల్ రష్దియాలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ బస్సు హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్ని ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. బ్యారియర్ 2.2 మీటర్ల ఎత్తులో వుండగా, అంతకంటే ఎక్కువ ఎత్తున్న బస్సులు ఈ మార్గంలో ప్రయాణించడానికి లేదు. అయితే, మవసలాట్కి చెందిన బస్సు అతి వేగంతో దూసుకొచ్చి ఈ బ్యారియన్ని ఢీకొంది. మస్కట్ - దుబాయ్ మధ్య తిరిగే బస్సు ఇది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు