అతి వేగంపై దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- June 08, 2019
దుబాయ్లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం 17 మందిని బలి తీసుకున్న ఘటన నేపథ్యంలో దుబాయ్ పోలీస్, వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు అతి వేగానికి సంబంధించి. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, వాహనదారులు పరిమిత వేగంతో మాత్రమే తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని హెచ్చరించారు పోలీసులు. అతి వేగంతో వాహనాలు ప్రయాణిస్తే, వాహనదారులపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు. దుబాయ్లోని అల్ రష్దియాలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ బస్సు హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్ని ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. బ్యారియర్ 2.2 మీటర్ల ఎత్తులో వుండగా, అంతకంటే ఎక్కువ ఎత్తున్న బస్సులు ఈ మార్గంలో ప్రయాణించడానికి లేదు. అయితే, మవసలాట్కి చెందిన బస్సు అతి వేగంతో దూసుకొచ్చి ఈ బ్యారియన్ని ఢీకొంది. మస్కట్ - దుబాయ్ మధ్య తిరిగే బస్సు ఇది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







