రైళ్లలో మసాజ్.. తల, పాదాలకు మాత్రమే..
- June 09, 2019
చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తారు.
ప్రస్తుతానికి తల, పాదాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మసాజ్ చేస్తారు. ఎంపిక చేసిన రైళ్లలో గరిష్టంగా ఐదుగురు మసాజ్ చేసేవాళ్లను ఏర్పాటు చేస్తారు. వీళ్లకి రైల్వే శాఖ గుర్తింపుపత్రాలు జారీ చేస్తుంది. టిక్కెట్ రేట్లు పెంచకుండా రైల్వే ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే.. ఇలాంటి ప్రయోగాలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 రోజుల్లో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి రైళ్లలోనూ మసాజ్ చేయించుకుంటూ ప్రయాణికులు ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







