రైళ్లలో మసాజ్.. తల, పాదాలకు మాత్రమే..
- June 09, 2019
చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తారు.
ప్రస్తుతానికి తల, పాదాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మసాజ్ చేస్తారు. ఎంపిక చేసిన రైళ్లలో గరిష్టంగా ఐదుగురు మసాజ్ చేసేవాళ్లను ఏర్పాటు చేస్తారు. వీళ్లకి రైల్వే శాఖ గుర్తింపుపత్రాలు జారీ చేస్తుంది. టిక్కెట్ రేట్లు పెంచకుండా రైల్వే ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే.. ఇలాంటి ప్రయోగాలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 రోజుల్లో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి రైళ్లలోనూ మసాజ్ చేయించుకుంటూ ప్రయాణికులు ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







