రైళ్లలో మసాజ్.. తల, పాదాలకు మాత్రమే..
- June 09, 2019చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తారు.
ప్రస్తుతానికి తల, పాదాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మసాజ్ చేస్తారు. ఎంపిక చేసిన రైళ్లలో గరిష్టంగా ఐదుగురు మసాజ్ చేసేవాళ్లను ఏర్పాటు చేస్తారు. వీళ్లకి రైల్వే శాఖ గుర్తింపుపత్రాలు జారీ చేస్తుంది. టిక్కెట్ రేట్లు పెంచకుండా రైల్వే ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే.. ఇలాంటి ప్రయోగాలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 రోజుల్లో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి రైళ్లలోనూ మసాజ్ చేయించుకుంటూ ప్రయాణికులు ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్