నేడు తిరుమలకు ప్రధాని.. స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం రెడీ..
- June 09, 2019ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు.
అధికారిక పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ విడివిడిగా రోడ్డు మార్గాన తిరుమలకు పయనమవుతారు.
సాయంత్రం 5:30 నుంచి ఏడున్నర గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలోనే ఉంటారు. దైవ దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు.
అక్కడి నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు పలుకుతారు.
ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోనే రాత్రి బస చేసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశం అనంతరం తిరుపతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సచివాలయానికి వెళ్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్