నేడు తిరుమలకు ప్రధాని.. స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం రెడీ..
- June 09, 2019
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు.
అధికారిక పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ విడివిడిగా రోడ్డు మార్గాన తిరుమలకు పయనమవుతారు.
సాయంత్రం 5:30 నుంచి ఏడున్నర గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలోనే ఉంటారు. దైవ దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు.
అక్కడి నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు పలుకుతారు.
ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోనే రాత్రి బస చేసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశం అనంతరం తిరుపతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సచివాలయానికి వెళ్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







