అణచివేతకు వ్యతిరేకంగా సూడాన్లో ఉద్యమం ఉదృతం..ఘర్షణల్లో ముగ్గురు మృతి
- June 11, 2019
ఖర్తోమ్ : సూడాన్లో మిలటరీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల నేతృత్వంలోని పలు సంఘాలు ఆది వారం సహాయ నిరాకరణను పాటించాయి. మిలటరీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ సమ్మె ప్రారంభించాయి. మిలటరీ ప్రభుత్వ అణిచివేత చర్యల్లో 100 మందికిపైగా మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమ్మె సందర్భంగా భద్రతా బలగాలతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారని డాక్టర్స్ కమిటీ తెలిపింది. దీంతో ఇటీవల కాలంలో సైన్యం చేపట్టిన అణిచివేత చర్యలో మరణించిన వారి సంఖ్య 117కు చేరుకుంది. మిలటరీ ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను 60గా చెబుతూ తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. దేశంలో పౌర ప్రభుత్వం ఏర్పడే వరకు సూడాన్ నుండి రాకపోకలను రద్దు చేయాలని ఆఫ్రికన్ యూనియన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో రాజకీయ, సామాజిక వాతావ రణం క్షీణించింది. సూడాన్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఎస్పిఎ) ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ శాంతి యుతంగా సమ్మె చేస్తూ ప్రతిఘటించడమే అధికారంలో ఉన్న మిలటరీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సరైన మార్గమని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో సూడాన్ అధ్యక్షుడు ఒమర్ హసన్ అల్ బషీర్ రాజీనామా చేసిన నాటి నుండి దేశంలో మిలటరీ పాలన కొనసాగు తున్న సంగతి తెలిసిందే. సైనికుల అణచివేత చర్యల కారణంగా జీవించే హక్కును పరిరక్షించుకోవలసిన అవసరముందని ఎస్పిఎ తన ప్రకటనలో పేర్కొంది.
ఐరాస ఖండన
సూడాన్లో హింసాత్మక చర్యలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. సూడాన్ పౌరులపై బలప్రయోగాన్ని ఆయన నిరసించారు. పలువురు మృతికి, గాయపడటానికి కారణమైన సైనిక చర్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









