ఫలించని శ్రమ
- June 11, 2019
బోరు బావిలో పడిన బాలుడ్ని రక్షించడం కోసం ఐదు రోజులుగా పడ్డ శ్రమ ఫలించలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని బయటకు తీసినప్పటికీ చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల6న పంజాబ్లో బోరు బావిలో పడ్డ ఆ రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడయ్యాడుగా బయటకు వచ్చాడు. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సహాయక సిబ్బంది సురక్షితంగా బాలున్ని బయటకు తీయడంతో సంతోషపడ్డ పిల్లాడి తల్లిదండ్రులకు అంతలోనే చేదు వార్త వినాల్సివచ్చింది.
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా భగవాన్పురలో ఈ నెల6న ఫతేవీర్సింగ్ అనే రెండేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 110 ఫీట్ల లోతులో బాలుడు ఇరుక్కుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బాలుడిని కాపాడేందుకు బోరుకు సమాంతరంగా బావి తవ్వారు. ఎప్పటికప్పుడు బాలుడి కదలికలను గమనిస్తూ..బోరులో ఆక్సిజన్ పంపించారు. లోతులో పడిపోవడంతో బాలున్ని తీయడం సహాయక సిబ్బందికి కష్ట సాధ్యంగా మారింది. దాదాపు ఐదు రోజులు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
ఐదు రోజుల పాటు బావిలోనే ఉండడంతో అనారోగ్యానికి గురైన బాలుడు ఫతేవీర్ సింగ్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొనఊపిరితో ఉన్న ఆ చిన్నారికి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కానీ డాక్టర్స్ కృషి ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆ బాలుడు కన్నుమూశాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









