ఫలించని శ్రమ
- June 11, 2019
బోరు బావిలో పడిన బాలుడ్ని రక్షించడం కోసం ఐదు రోజులుగా పడ్డ శ్రమ ఫలించలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని బయటకు తీసినప్పటికీ చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల6న పంజాబ్లో బోరు బావిలో పడ్డ ఆ రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడయ్యాడుగా బయటకు వచ్చాడు. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సహాయక సిబ్బంది సురక్షితంగా బాలున్ని బయటకు తీయడంతో సంతోషపడ్డ పిల్లాడి తల్లిదండ్రులకు అంతలోనే చేదు వార్త వినాల్సివచ్చింది.
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా భగవాన్పురలో ఈ నెల6న ఫతేవీర్సింగ్ అనే రెండేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 110 ఫీట్ల లోతులో బాలుడు ఇరుక్కుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బాలుడిని కాపాడేందుకు బోరుకు సమాంతరంగా బావి తవ్వారు. ఎప్పటికప్పుడు బాలుడి కదలికలను గమనిస్తూ..బోరులో ఆక్సిజన్ పంపించారు. లోతులో పడిపోవడంతో బాలున్ని తీయడం సహాయక సిబ్బందికి కష్ట సాధ్యంగా మారింది. దాదాపు ఐదు రోజులు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
ఐదు రోజుల పాటు బావిలోనే ఉండడంతో అనారోగ్యానికి గురైన బాలుడు ఫతేవీర్ సింగ్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొనఊపిరితో ఉన్న ఆ చిన్నారికి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కానీ డాక్టర్స్ కృషి ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆ బాలుడు కన్నుమూశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







