ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- June 14, 2019
ఎక్సర్సైజ్ : చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అయితే, ఈ సమయంలో అతిగా చేయకూడదు.. ఎందుకంటే సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. శరీరం త్వరగా అలసిపోతుంది. ముఖ్యంగా ఉదయం మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం రోజంతా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి.. ఎక్సర్సైజ్ విషయంలో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
స్నానానికి ముందు మసాజ్ : ఈ సమయంలో స్నానాని02కి ముందు శరీరాన్ని కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొన్ని పరిశోధనల్లో ఈ మసాజ్తో జీర్ణసమస్యలు కూడా తగ్గిపోతాయని తేలింది.
అతిగా వేడి, చల్లని పదార్థాలు తీసుకోకపోవడం : ఈ సమయంలో ఎక్కువగా వేడి, చల్లగా ఉన్న డ్రింక్స్, ఫుడ్ని తీసుకోకపోవడం మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్, జ్యూస్లు తాగుతుంటారు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. కాబట్టి.. ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాఫీ, టీలు తగ్గించడం : అసలే మండే ఎండలు.. అందులోనూ కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి.. ఈ విషయంలోనూ జాగ్రత్తపడడం ముఖ్యం.
జంక్ ఫుడ్ తగ్గించడం : గ్రిల్డ్ ఫుడ్, చిప్స్, చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.
పండ్లు తీసుకోవడం : వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. పుచ్చకాయలు, దోసకాయలు, బ్రకోలి ఇలాంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో నీటిశాతం పెరిగుతుంది.
రాత్రి పడుకునే ముందు మసాజ్ : రాత్రి పడుకునే ముందు కూడా ఏవైనా అరోమా ఆయిల్స్ అంటే శాండిల్, జాస్మిన్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్తో బాడీ మసాజ్ చేస్తుండాలి. ఒకవేళ వీలుకాకపోతే.. హెడ్ మసాజ్ అయినా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ పూర్తిగా తగ్గుతుంది. మరునాటి ఉదయానికి మనం చాలా యాక్టివ్గా ఉంటాం.
తాజా వార్తలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ







