ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం

- July 17, 2026 , by Maagulf
ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం

కువైట్: ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్‌లోని ఒక విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం జరిగినట్లు కువైట్ విద్యుత్, నీటి మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ దాడి కారణంగా ప్లాంట్‌లోని కొన్ని కీలక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యుత్ ఉత్పత్తి చేసే పలు యూనిట్లు ప్రభావితమయ్యాయని తెలిపింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను వెంటనే అమలు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో విద్యుత్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కువైట్ ఫైర్ ఫోర్స్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మంత్రిత్వ శాఖకు చెందిన అత్యవసర, సాంకేతిక బృందాలు సంబంధిత అధికారులతో కలిసి నష్టాన్ని అంచనా వేయడం, ప్లాంట్‌ను భద్రపరచడం, ప్రభావిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను వీలైనంత త్వరగా తిరిగి సేవల్లోకి తీసుకురావడం కోసం పనులు ప్రారంభించాయి.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడడంతో పాటు జాతీయ విద్యుత్ గ్రిడ్‌ను స్థిరంగా కొనసాగించేందుకు సాంకేతిక బృందాలు 24 గంటల పాటు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే విద్యుత్ నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com