ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో 'ఇంటర్నేషనల్ యోగా డే'
- June 14, 2019
అబుధాబి:జూన్ 20వ తేదీన అబుధాబిలోని ఉమ్ అల్ ఎమరాత్ పార్క్లో ఐదవ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ జరగబోతోంది. అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ మినిస్టర్ ఆఫ్ టోలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ హాజరు కాబోతున్నారు. గత నాలుగేళ్ళుగా అబుధాబిలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామనీ, ఈ క్రమంలో యూఏఈ అధికార యంత్రాంగం తమకు మంచి మద్దతు ఇస్తోందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. కాగా, ఎంబసీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా వేడుకలు జూన్ 28న అల్ అయిన్లోని జహిల్ పార్క్లో నిర్వహించనున్నారు. ఉచిత ప్రవేశం పార్కింగ్, యోగా మ్యాట్స్ మరియు టీ షర్టులు పార్టిసిపెంట్స్కి అందజేయబడ్తాయి. కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేస్తారు. యోగా మాస్టర్స్ డెమోన్స్ట్రేషన్స్తోపాటుగా పలు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇండియా టూరిజం, బ్యాంక్ ఆఫ్ బరోడా, లులు గ్రూప్, లులు ఎక్స్ఛేంజ్, ఎన్సి హెల్త్కేర్, విపిఎస్ హెల్త్ కేర్, యూఏఈ ఎక్స్ఛేంజ్, ఇండియన్ బిజినెస్ మరియు ప్రొఫెషనల్ గ్రూప్ అబుధాబి సహాయ సహకారాలతో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వివరాల్ని వెల్లడించేందుకోసం ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సూరి, ప్రెస్మీట్ నిర్వహించారు. ఎంబసీ వెబ్సైట్లో పూర్తి వివరాలు లభ్యమవుతాయి. రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ http://bit.do/IDY-2019- registration క్లిక్ చెయ్యగలరు.




_1560490585.jpg)
_1560490596.jpg)
తాజా వార్తలు
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ







