ముస్సాఫాలో ఇండియన్ మిషన్ సర్వీసెస్
- June 15, 2019
అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇది. వేలాది మంది బ్లూ కాలర్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్, అటెస్టేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అలాగే వీసా సంబంధిత పేపర్ వర్క్స్ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్కి అప్రూవల్ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్ రాజమురుగన్ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







