ముస్సాఫాలో ఇండియన్ మిషన్ సర్వీసెస్
- June 15, 2019
అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇది. వేలాది మంది బ్లూ కాలర్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్, అటెస్టేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అలాగే వీసా సంబంధిత పేపర్ వర్క్స్ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్కి అప్రూవల్ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్ రాజమురుగన్ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..