నేడు విజయవాడకు కే.సి.ఆర్
- June 17, 2019
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరో ఏపీ సీఎం జగన్తో సమావేశం కానున్నారు. విజయవాడ వేదికగా ఇరువురు సమావేశం కానున్నారు. మధ్యా హ్నం 12.50కి గన్నవరం చేరుకుంటారు. అనతంరం విజయవాడలోని గేట్ వే హోటల్లో కేసీఆర్ విశాంత్రి తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1.45కి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు . అనంతరం 2.30కి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లీ ఆయనతో భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. అక్కడే ఇరువురు బోజనం చేస్తారు.
లంచ్ తరువాత ఇద్దరూ కలిసి తాజా రాజకీయ పరిణామాలు, విభజన సమస్యలపై చర్చించుకోనున్నారు. గతంలో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రి కొన్ని సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఆమేరకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాల అప్పగింత జరిగింది. ఇక మిగిలిన అంశాలపై ఈ సమావేశంలో చర్చింకునే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది.
ఈసమావేశం అనంతరం .. ఇద్దరు సీఎంలు సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్తారు. జగన్, కేసీఆర్లతో పాటు గవర్నర్ నరసింహన్ సైతం శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ ఉత్సవానికి హాజరవుతారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్ గన్నవరం నుంచి తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!