జపాన్ లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదంలేదన్న అధికారులు..
- June 19, 2019
నిగట: జపాన్ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం రాత్రి వచ్చిన ప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. అయితే తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు తాజాగా వాటిని ఉపసంహరించుకున్నారు. సునామీ వల్లే అవకాశంలేదని ప్రకటించారు.
మంగళవారం రాత్రి యమగట తీరంలో వచ్చిన భూకంపంతోప్రజలు భయంతో వణికిపోయారు. భూప్రకంపన ధాటికి ఇళ్లు ఊగిపోయాయి. జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల భూమి బీటలు వారింది. భూకంపం వల్ల నీగట, యమగట, మియాగ్రీల్లో 15మంది గాయపడ్డారు. భూప్రకంపనల కారణంగా పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
భూకంపం కారణంగా యమగట, నిగట, ఇషికావాలోని నోటో ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో ఏడు మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీగట, యమగట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







