విస్తార ఎయిర్లైన్స్ వారి మాన్సూన్ సేల్
- June 18, 2019
భారత దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న మరో ప్రైవేట్ విమానయాన సంస్థ విస్తారా.ఈ సంస్థ దేశంలోని పలు నగరాలను విమాన సర్వీసులను నడుపుతోంది. ఇపుడు మాన్సూన్ సేల్ పేరుతో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.
ఈ ఆఫర్లో రూ.1299కే టిక్కెట్ ధరను ప్రకటించింది. అయితే, ఈ టిక్కెట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈ ఆఫర్లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారు జూలై 3వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ మధ్య ప్రయాణించే వెసులుబాటును కల్పించారు.
కాగా, ఇటీవల విస్తారా సంస్థకు 62 కొత్త విమానాలు వచ్చి కలిశాయి. దీంతో విమానాల సంఖ్య 170కి చేరింది. ఈ సంస్థ ప్రతి రోజూ 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి 10 నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







