సేదతీరేందుకు యూరప్ వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలి
- June 19, 2019
అమరావతి: ఈ తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని అన్నారు ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని తెలుపుతూ ఓ లేఖను టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఇవ్వాగా, వారు దీన్ని నేడు ప్రహ్లాద్ జోషికి అందించనున్నారు. తన కార్యక్రమం ముందుగా ఖరారై పోయిందని, ఆ తరువాతే సమావేశపు ఆహ్వానం తనకు అందిందని పేర్కొన్న చంద్రబాబు, అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖను పంపుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 24 వరకూ చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







