ఈత సరదా, ఇద్దర్ని మింగేసింది
- June 19, 2019
మస్కట్: సముద్రంలో ఈత సరదా ఇద్దర్ని బలి తీసుకుంది. మరో ఆరుగుర్ని రాయల్ ఒమన్ పోలీసులు ప్రాణాలతో బయటకు తీశారు. విలాయత్ ఆఫ్ సీబ్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీబ్లోని సూర్ అల్ హాదిద్ బీచ్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా, కోస్ట్గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ కెరటాల ధాటికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగుర్ని కోస్ట్గార్డ్ సిబ్బంది రక్షించగలిగారు. మరో ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్బంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







