మలేషియా లో ఘనంగా జరిగిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

- June 23, 2019 , by Maagulf
మలేషియా లో ఘనంగా జరిగిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

మలేషియా:మలేషియా లో ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది భారతీయులు పాల్గొన్నారు.మలేషియా లోని బటు కేవ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మృదుల్ కుమార్ (ఇండియన్ అంబాసిడర్) ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా మరియు డా.శ్రీనివాస్ ఏలూరి (UN YCPI అంబాసిడర్) గెస్ట్ గా హాజరయ్యారు.మృదుల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్‌ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com