కజకిస్థాన్:ఆర్మీ ఆయుధ డిపోలో భారీ పేలుళ్లు
- June 25, 2019
ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం చోటుచేసుకున్న వరుస పేలుళ్లతో కజకిస్థాన్ వణికిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా, 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర కజక్లోని ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం ఈ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు తెలిపారు. డిపోలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అందులోని ఆయుధాలు పెద్ద శబ్దంతో పేలిపోయినట్టు కజకిస్థాన్ రక్షణ శాఖ పేర్కొంది. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడు సంభవించినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన 50 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధ డిపోలో మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియరాలేదు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







