ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
- June 27, 2019
ముంబై: ముంబై నుంచి అమెరికాలో నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్లోని స్టాన్ స్టెడ్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్లు బెదిరింపు సమాచారం అందింది. దీంతో బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ టైఫూన్ జెట్ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









