ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

- June 27, 2019 , by Maagulf
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ముంబై: ముంబై నుంచి అమెరికాలో నెవార్క్‌ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్‌లోని స్టాన్‌ స్టెడ్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్లు బెదిరింపు సమాచారం అందింది. దీంతో బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ టైఫూన్‌ జెట్‌ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్‌ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com