విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు
- June 27, 2019
ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు. విండీస్తో జరుగుతోన్న మ్యాచ్లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయి అందుకోగా… గతంలో సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా 453 ఇన్నింగ్స్లలో ఈ రికార్డ్ సాధించారు. దీంతో సచిన్,లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అలాగే ఈ మైలురాయి అందుకున్న మూడో భారత బ్యాట్స్మెన్గానూ ఘనత సాధించాడు. ఇంతకుముందు సచిన్ , ద్రావిడ్ మాత్రమే 20వేల పరుగుల ఫీట్ అందుకున్నారు. కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్లలో 20 వేల పరుగులు పూర్తి చేశాడు. భారత కెప్టెన్ టెస్టుల్లో 131 , వన్డేల్లో 224 , టీ ట్వంటీల్లో 62 ఇన్నింగ్స్లు ఆడాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









