అంబులెన్స్కు దారివ్వలేదో భారీ ఫైన్ ...
- June 28, 2019
న్యూ ఢిల్లీ:ఆఫీస్కి టైమైపోతోంది.. ఏ కాస్త సందు దొరికినా దూరేసి వెళ్లిపోవాలి. ఎనకా ముందు ఎవరొస్తే మనకేంటి.. అని అనుకున్నారో అడ్డంగా బుక్కైపోతారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే కదా అంబులెన్స్ ఫ్రిఫర్ చేస్తారు. అయినా కానీ మనకేం పట్టనట్టు ఉంటే ఎలా. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యవసర వాహనాలకు అడ్డు వస్తే 10 వేల రూపాయల జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసే చట్టాలను తీసుకురానుంది. మరో వైపు మైనర్లకు వెహికల్స్ ఇచ్చినా, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, రాష్ డ్రైవింగ్ చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయని అంటోంది కేంద్రం. తాగుతూ, తూలుతూ డ్రైవింగ్ చేసే వారికి కూడా సత్కారం మామూలుగా ఉండదంటోంది. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేసే ఉద్ధేశంతో ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ నిబంధనలకు ఆమోదం తెలిపింది.
అంబులెన్స్కి అడ్డొస్తే 10 వేలు, లైసెన్స్ లేకుండా నడిపినా, డ్రంకెన్ డ్రైవ్ చేసినా 10 వేలు.. మైనర్లకు వెహికలిస్తే రూ.25 వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే 2వేలు, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే వెయ్యి రూపాయలతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించే విధంగా చట్టాలు రూపొందించారు. ఇక బండి మీద రయ్ మని దూసుకెళ్లారనుకోండి.. మీ బండికి బ్రేకులు వేసి 1,000 నుంచి 2,000 లు కట్టి అప్పుడు కదులు అంటారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







