కిమ్ ని కలిసిన ట్రంప్
- June 30, 2019ప్రపంచదేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ లు కలుసుకున్నారు. దక్షిణ, ఉత్తర కొరియా సరిహద్దులోని సైనిక రహిత గ్రామమైన పన్మున్ జోన్ గ్రామంలో ఇరువురు నేతలు కలిశారు. ట్రంప్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కిమ్ అనగా… మా ఇద్దరిమధ్య గొప్ప స్నేహబంధం ఉందని, ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ట్రంప్.
ఈ సందర్భంగా సరిహద్దుకు అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్ తో కలిసి ట్రంప్ అడుగు పెట్టారు. ఈ సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా పాల్గొని కిమ్ తో కరచాలనం చేశారు. మా సమావేశం దురదుష్టకరమైన గతాన్ని తొలగించి కొత్త భవిష్యతకు నాందిగా నిలుస్తుందని కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా మూడు దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా కనిపించారు. ఇది చారిత్రక సమావేశమని పరిశీలకులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు