దుబాయ్లో ఎంప్లాయర్ చెర నుంచి నలుగురు భారతీయ మహిళలకు విముక్తి
- July 01, 2019దుబాయ్లో తమిళనాడుకి చెందిన నలుగురు యువతుల్ని అక్రమంగా నిర్బందించిన ఎంప్లాయర్ నుంచి ఎట్టకేలకు విడిపించగలిగారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ) మెంబర్స్. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో హోస్టెసెస్గా పనిచేసందుకోసం తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఈ నలుగురు మహిళలు దుబాయ్ చేరుకున్నారు. అయితే, వారిని దుబాయ్లోని ఓ బార్లో డాన్సర్లుగా మారాలంటూ ఎంప్లాయర్ ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు కోల్పోయిన యువతులు, అతి కష్టమ్మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ని సంప్రదించగలిగారు. ఇ-మైగ్రేట్ సిస్టమ్ ద్వారా ఫ్రాడ్ స్పాన్సరర్స్ గురించి తెలుసుకునే అవకాశం వుందనీ, ఉద్యోగార్ధులు, ఉపాధి కోసం వచ్చేవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర లేదా ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రాడ్స్ గురించి తెలుసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం