దుబాయ్లో ఎంప్లాయర్ చెర నుంచి నలుగురు భారతీయ మహిళలకు విముక్తి
- July 01, 2019
దుబాయ్లో తమిళనాడుకి చెందిన నలుగురు యువతుల్ని అక్రమంగా నిర్బందించిన ఎంప్లాయర్ నుంచి ఎట్టకేలకు విడిపించగలిగారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ) మెంబర్స్. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో హోస్టెసెస్గా పనిచేసందుకోసం తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఈ నలుగురు మహిళలు దుబాయ్ చేరుకున్నారు. అయితే, వారిని దుబాయ్లోని ఓ బార్లో డాన్సర్లుగా మారాలంటూ ఎంప్లాయర్ ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు కోల్పోయిన యువతులు, అతి కష్టమ్మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ని సంప్రదించగలిగారు. ఇ-మైగ్రేట్ సిస్టమ్ ద్వారా ఫ్రాడ్ స్పాన్సరర్స్ గురించి తెలుసుకునే అవకాశం వుందనీ, ఉద్యోగార్ధులు, ఉపాధి కోసం వచ్చేవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర లేదా ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రాడ్స్ గురించి తెలుసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







