హౌతీ ద్రోన్స్ని కూల్చేసిన అరబ్ కోలిషన్
- July 01, 2019
సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు సంధించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ వెల్లడించింది. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, సదరన్ ప్రావిన్స్ ఆఫ్ అసిర్ వైపు రాత్రి 11.45 నిమిషాల సమయంలో రెండు డ్రోన్లు సివిలియన్లే లక్ష్యంగా దూసుకొచ్చినట్లు చెప్పారు. డ్రోన్లను విజయవంతంగా కూల్చేయడం జరిగిందనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కల్నల్ మాల్కి చెప్పారు. ఖసాఫ్ 2కె డ్రోన్స్ ద్వారా సౌదీలోని అభా అలాగే జిజాన్ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసినట్లు హౌతీలకు చెందిన న్యూస్ ఛానల్ అల్ మసిరాహ్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు, సౌదీపై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 12న జరిగిన మిస్సైల్ దాడిలో 26 మంది సివిలియన్స్ గాయపడ్డారు. జూన్ 23న జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల&్పగా, 21 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







