హౌతీ ద్రోన్స్ని కూల్చేసిన అరబ్ కోలిషన్
- July 01, 2019
సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు సంధించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ వెల్లడించింది. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, సదరన్ ప్రావిన్స్ ఆఫ్ అసిర్ వైపు రాత్రి 11.45 నిమిషాల సమయంలో రెండు డ్రోన్లు సివిలియన్లే లక్ష్యంగా దూసుకొచ్చినట్లు చెప్పారు. డ్రోన్లను విజయవంతంగా కూల్చేయడం జరిగిందనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కల్నల్ మాల్కి చెప్పారు. ఖసాఫ్ 2కె డ్రోన్స్ ద్వారా సౌదీలోని అభా అలాగే జిజాన్ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసినట్లు హౌతీలకు చెందిన న్యూస్ ఛానల్ అల్ మసిరాహ్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు, సౌదీపై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 12న జరిగిన మిస్సైల్ దాడిలో 26 మంది సివిలియన్స్ గాయపడ్డారు. జూన్ 23న జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల&్పగా, 21 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







