ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..
- July 04, 2019
గ్రీస్:మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తామంటున్నారు అంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో నివసించే వారికి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుంది. ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జనం సంచారం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవి కాలం వస్తే ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది కానీ మాములు రోజుల్లో అయితే మనుషులే కనిపించరు.
మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్న అంటీకైథెరా ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయని ద్వీప మేయర్ ఆండ్రియాస్ చార్చలకిస్ గ్రీకు వెబ్సైట్కు చెప్పారు. ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామంటోంది గ్రీస్ దేశం. ద్వీపాన్ని కాపాడుకోవాలని, దానికి పునర్వైభవాన్ని తీసుకు రావాలనే వారి ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







