ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..
- July 04, 2019
గ్రీస్:మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తామంటున్నారు అంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో నివసించే వారికి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుంది. ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జనం సంచారం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవి కాలం వస్తే ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది కానీ మాములు రోజుల్లో అయితే మనుషులే కనిపించరు.
మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్న అంటీకైథెరా ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయని ద్వీప మేయర్ ఆండ్రియాస్ చార్చలకిస్ గ్రీకు వెబ్సైట్కు చెప్పారు. ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామంటోంది గ్రీస్ దేశం. ద్వీపాన్ని కాపాడుకోవాలని, దానికి పునర్వైభవాన్ని తీసుకు రావాలనే వారి ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







