100 మహిళా జవాన్ల పోస్టులకు రెండు లక్షల మంది దరఖాస్తు!
- July 04, 2019రక్షణ దళాల్లోకి మహిళల ప్రవేశానికి కేంద్రం ఓకే చెప్పినప్పటి నుంచీ ఆ రంగం పట్ల మహిళలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన ఇది. వంద మహిళా జవాన్ల పోస్టులకు రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళలను రక్షణ రంగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత తొలిసారి ఆరుగురు మహిళలు భారత వాయుసేనలో చేరారు. ప్రస్తుతం వారు ఫైటర్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు.
తాజాగా, కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ)లో వంద జవాన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆశ్చర్యకరంగా రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకుని ఆశ్చర్యపరిచారు. మరోవైపు, మహిళా ప్రొవొస్ట్ యూనిట్'లను పెంచుకునేందుకు సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు, 40 మంది జవాన్లు ఉంటారు. ఇందుకు సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్మీలో అధికారి స్థాయిలో మాత్రమే మహిళలు ఉన్నారు. వీరిని యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ సేనలకు దూరంగా ఉంచుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం