అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి..
- July 06, 2019
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. విహారయాత్ర కోసం కుటుంబ సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి వెళ్లిన నూనె సురేశ్ ప్రమాదావశాత్తు నీటిలో పడి చనిపోయాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్ డల్లాస్ లో స్థిరపడ్డాడు. సింతెల్ కంపెనీలో ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు పాప, బాబు ఉన్నారు. విహారయాత్రకు వెళ్లి, ప్రమాదావశాత్తు టర్నర్ జలపాతంలో మృతి చెందాడు.
సురేశ్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. ఆయనకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే మృతదేహాన్ని తరలించడానికి 80 వేల డాలర్లు కావాలి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఫండ్ రేజింగ్ వెబ్ సైట్ళో అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







