ఢిల్లీ లో రేడియో జాకీ అరెస్ట్
- July 06, 2019ఢిల్లీ:ఓ రేడియో జాకీ డ్రైవింగ్ అలసత్వం కారణంగా లోక్జనశక్తి పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. దీంతో రేడియో జాకీ అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హిట్ అండ్ రన్ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు అవడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం తర్వాత అంకిత్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతని కోసం గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అంకిత్ గులాటి.. రేడియో సిటీలో ఆర్జేగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై డిల్లీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ