ఢిల్లీ లో రేడియో జాకీ అరెస్ట్
- July 06, 2019
ఢిల్లీ:ఓ రేడియో జాకీ డ్రైవింగ్ అలసత్వం కారణంగా లోక్జనశక్తి పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. దీంతో రేడియో జాకీ అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హిట్ అండ్ రన్ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు అవడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం తర్వాత అంకిత్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతని కోసం గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అంకిత్ గులాటి.. రేడియో సిటీలో ఆర్జేగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై డిల్లీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







