తెలుగు ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
- July 07, 2019
ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రప్రభుత్వాలకు దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ మార్గదర్శకాలు కూడా ఉండాలని పిటిషనర్ పెంటపాటి పుల్లారావు సుప్రీంను కోరారు. గతంలోనే దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. వాదనల తర్వాత దీనిపై సీఈసీతోపాటు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం.
ఏపీలో ఏపీలో అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పేరుతో సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహాలో పథకాలు అమలు చేశారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇకపై ఇలాంటివి కొనసాగకుండా చూడాలని సుప్రీంను కోరారు. నగదు బదిలీ పథకాలు, ఉచిత పథకాల్లాంటివి రాజ్యాంగ విరుద్ధమని పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు ఇలాంటివి అమలు చేయాలని భావిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందే వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







