తెలుగు ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
- July 07, 2019ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రప్రభుత్వాలకు దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ మార్గదర్శకాలు కూడా ఉండాలని పిటిషనర్ పెంటపాటి పుల్లారావు సుప్రీంను కోరారు. గతంలోనే దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. వాదనల తర్వాత దీనిపై సీఈసీతోపాటు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం.
ఏపీలో ఏపీలో అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పేరుతో సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహాలో పథకాలు అమలు చేశారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇకపై ఇలాంటివి కొనసాగకుండా చూడాలని సుప్రీంను కోరారు. నగదు బదిలీ పథకాలు, ఉచిత పథకాల్లాంటివి రాజ్యాంగ విరుద్ధమని పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు ఇలాంటివి అమలు చేయాలని భావిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందే వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..