పీక్స్ కి చేరిన చెన్నై నీటి ఎద్దడి
- July 12, 2019
హైదరాబాద్: చెన్నై మహానగరం తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ వెల్లోర్ నుంచి చెన్నైకు ఓ ప్రత్యేక రైలును తీసుకువెళ్తున్నారు. నీటి బోగీలతో ఆ రైలు ఇవాళ ఉదయం జోలార్పేట్ రైల్వే స్టేషన్ నుంచి కాసేపటి క్రితం బయలుదేరింది. రైల్వే వ్యాగన్ల ద్వారా నీటిని చెన్నైకు తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం పేర్కొన్నది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ రైలు చెన్నై స్టేషన్కు చేరుకోనున్నది. 50 బోగీల్లో సుమారు 50 వేల లీటర్ల నీళ్లు ఉన్నాయి. విల్లివక్కం వద్ద రాష్ట్ర మంత్రి ఆ రైలుకు స్వాగతం పలకనున్నారు. వ్యాగన్లలో ఉన్న నీటిని.. కిల్పాక్ వాటర్ వర్క్స్కు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కిల్పాక్ వాటర్ వర్క్స్ నుంచి నీటిని నగరమంతా సరఫరా చేయనున్నారు. మొత్తం రెండు రైళ్ల ద్వారా నీటిని తరలించనున్నారు. ఒక రైలు జోలార్పేట్ నుంచి, మరో రైలు అవది రైల్వే యార్డ్ నుంచి బయలుదేరనున్నాయి.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







