భారత్ పై భగ్గుమంటున్న ట్రంప్
- July 12, 2019
భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన కొత్త టారిఫ్ నిబంధనలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై సుంకాలను పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భగ్గుమన్నారు. భారత చర్య తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయని వాల్ మార్ట్ పేర్కొంది. భారత-అమెరికా దేశాలమధ్య ఈ నిబంధనలు కీలకంగా మారిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. గతంలో ఇది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పై 16 బిలియన్ యుఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ సొమ్ము వాల్డ్ లోనే ఒక సంస్థ మరొక దానిపై ఇన్వెస్ట్ చేసిన అత్యధికమైనదిగా పేర్కొంటున్నారు. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.. ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







