పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న ధోనీ!
- July 13, 2019ప్రపంచకప్లో భారత్ కథ సెమీస్తో ముగియడంతో ఇప్పుడు చర్చంతా సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తపైనే జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రిటైర్మెంట్ అనంతరం ధోని బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధోని త్వరలోనే నరేంద్రమోదీ టీమ్లో పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందన్నారు.
ధోని బీజేపీలో చేరేలే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 'ధోని నా స్నేహితుడు. అతనొక ప్రపంచ దిగ్గజ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే అతని రిటైర్మెంట్ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.' అని పాస్వాన్ పేర్కొన్నారు. ఇక ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!