అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పై ఆధారబడ్డ కుల్భూషణ్ భవితవ్యం
- July 17, 2019
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్ భవితవ్యం ఇవాళే తేలనుంది. జాదవ్ కేసులో ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుల్భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యం చేస్తుంటే పట్టుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోన్న అంతకు ముందే తమ దేశ ఆర్మీ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, జాదవ్ దుబాయ్లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు పాకిస్థాన్కు తీసుకెళ్లారని ఆయన కుటుంసభ్యులు వాదిస్తున్నారు. ఇక, పాక్ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ కేసులో జాదవ్ నేరం చేశాడని పాకిస్థాన్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అంతర్జాతయ కోర్టు తప్పుబట్టింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్సాల్వే వాదించారు. జాదవ్ను నిర్ధోషిగా విడిపిస్తారా? లేక పాకిస్థాన్ తీర్పును ఖరారు చేస్తారా? అనే విషయం ఇవాళ తేలనుంది. ఈ కేసులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్ భావిస్తోంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







