అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పై ఆధారబడ్డ కుల్భూషణ్ భవితవ్యం
- July 17, 2019
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్ భవితవ్యం ఇవాళే తేలనుంది. జాదవ్ కేసులో ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుల్భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యం చేస్తుంటే పట్టుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోన్న అంతకు ముందే తమ దేశ ఆర్మీ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, జాదవ్ దుబాయ్లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు పాకిస్థాన్కు తీసుకెళ్లారని ఆయన కుటుంసభ్యులు వాదిస్తున్నారు. ఇక, పాక్ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ కేసులో జాదవ్ నేరం చేశాడని పాకిస్థాన్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అంతర్జాతయ కోర్టు తప్పుబట్టింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్సాల్వే వాదించారు. జాదవ్ను నిర్ధోషిగా విడిపిస్తారా? లేక పాకిస్థాన్ తీర్పును ఖరారు చేస్తారా? అనే విషయం ఇవాళ తేలనుంది. ఈ కేసులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్ భావిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







