అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పై ఆధారబడ్డ కుల్భూషణ్ భవితవ్యం
- July 17, 2019
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్ భవితవ్యం ఇవాళే తేలనుంది. జాదవ్ కేసులో ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుల్భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యం చేస్తుంటే పట్టుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోన్న అంతకు ముందే తమ దేశ ఆర్మీ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, జాదవ్ దుబాయ్లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు పాకిస్థాన్కు తీసుకెళ్లారని ఆయన కుటుంసభ్యులు వాదిస్తున్నారు. ఇక, పాక్ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ కేసులో జాదవ్ నేరం చేశాడని పాకిస్థాన్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అంతర్జాతయ కోర్టు తప్పుబట్టింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్సాల్వే వాదించారు. జాదవ్ను నిర్ధోషిగా విడిపిస్తారా? లేక పాకిస్థాన్ తీర్పును ఖరారు చేస్తారా? అనే విషయం ఇవాళ తేలనుంది. ఈ కేసులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్ భావిస్తోంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







