ప్రభాస్ అభిమానులు ఇంకొన్ని రోజులు వేచిఉండక తప్పేట్టులేదు!
- July 17, 2019
'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 'సాహో' వెనక్కి వెళ్లడంతో శర్వానంద్ 'రణరంగం', అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15కి వచ్చాయి. ఉన్నట్టుండి రెండు సినిమాల విడుదల తేదీలు మంగళవారం ప్రకటించడంతో ప్రేక్షకుల్లో, పరిశ్రమలో 'సాహో'కి పోటీగా వస్తున్నారేంటి? అని చర్చ మొదలైంది. ఆరాలు తీయగా 'సాహో' వాయిదా పడుతుందని తెలిసి ఆగస్టు 15పై కర్చీఫ్ వేశారని తెలిసింది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ 'రణరంగం'కు మంచి డేట్ దొరికింది. అయితే... ప్రభాస్ అభిమానులకు మాత్రం వాయిదా నిర్ణయం మింగుడు పడటం లేదు. దర్శకుడు సుజీత్, యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







