భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్
- July 19, 2019
బహ్రెయిన్: సల్మానియాలో మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భారత వలసదారుడు అబూబాకర్, రెండు కీడ్నీలూ ఫెయిల్ కావడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మొత్తం కుటుంబం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సన్నిహితులు కొంతమేర ధన సహాయం చేసినా అది సరిపోవడంలేదని సోషల్ వర్కర్ షబీర్ చెప్పారు. రమదాన్ మాసం తర్వాతి నుంచి అబూబాకర్ ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేర్చగా రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారనీ షబీర్ వెల్లడించారు. తదుపరి వైద్య చికిత్స కోసం ఇండియాకి తరలించడం జరిగిందనీ, అయితే చికిత్స చాలా ఖరీదైంది కావడంతో, బాధిత కుటుంబం సాయం కోరుతోందని షబ్బీర్ వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







