భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్
- July 19, 2019
బహ్రెయిన్: సల్మానియాలో మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భారత వలసదారుడు అబూబాకర్, రెండు కీడ్నీలూ ఫెయిల్ కావడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మొత్తం కుటుంబం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సన్నిహితులు కొంతమేర ధన సహాయం చేసినా అది సరిపోవడంలేదని సోషల్ వర్కర్ షబీర్ చెప్పారు. రమదాన్ మాసం తర్వాతి నుంచి అబూబాకర్ ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేర్చగా రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారనీ షబీర్ వెల్లడించారు. తదుపరి వైద్య చికిత్స కోసం ఇండియాకి తరలించడం జరిగిందనీ, అయితే చికిత్స చాలా ఖరీదైంది కావడంతో, బాధిత కుటుంబం సాయం కోరుతోందని షబ్బీర్ వివరించారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







